News May 23, 2024

సీపెట్ దరఖాస్తులకు 31వరకు గడువు

image

AP: విజయవాడలోని సీపెట్ కేంద్రంలో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ జేడీ శేఖర్ తెలిపారు. పదో తరగతి పాసైన వారికి మూడేళ్ల డిప్లమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, బీఎస్సీ చేసిన వారికి రెండేళ్ల పీజీ కోర్సు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే నెల 9న విజయవాడ, అనంతపురంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అప్లై లింక్: https://cipet24.onlineregistrationform.org/CIPET/

Similar News

News January 8, 2026

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

image

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.

News January 8, 2026

3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

image

న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్‌నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.

News January 8, 2026

కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

image

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.