News June 4, 2024
డియర్ కళ్యాణ్ బాబు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కళ్యాణ్ బాబు.. నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changerవే కాదు, Man of the matchవి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 12, 2025
MSTCలో 37 ఉద్యోగాలు

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://mstcindia.co.in/
News November 12, 2025
CCS సమావేశం ప్రారంభం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీతారామన్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఈ భేటీలో ఉగ్రవాదుల ఏరివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో మేజర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే CCS భేటీ అవుతుంది.
News November 12, 2025
ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.


