News October 9, 2025
20 మంది చిన్నారుల మృతి.. ‘శ్రేసన్’ ఓనర్ అరెస్ట్

దగ్గు <<17954495>>మందు<<>> అంటేనే భయపడేలా కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్ రంగనాథన్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, గ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.
Similar News
News October 9, 2025
పాక్ను ట్రోల్ చేస్తూ IAF డిన్నర్ మెనూ!

IAF 93వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది. ‘ఆపరేషన్ సిందూర్’, ‘ఆపరేషన్ బందర్’(2019)లో ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేసిన పాక్ సిటీల పేర్లు ఫుడ్ ఐటమ్స్కు పెట్టారు. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, బహవల్పూర్ నాన్, సర్గోదా దాల్ మఖానీ, జకోబాబాద్ మేవా పులావ్, మురిద్కే మీఠా పాన్ అంటూ మెనూకార్డ్ రూపొందించారు. దీంతో IAF ట్రోలింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News October 9, 2025
నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

AP: మాజీ CM జగన్ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.
News October 9, 2025
ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్.. స్పందించిన CP సజ్జనార్

TG: పోలీసులు, నాయకుల మద్దతుతో HYDలో ట్రాన్స్జెండర్ల దందా తారస్థాయికి చేరిందని, రూ.వేలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని ఓ నెటిజన్ Xలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ CP సజ్జనార్ను కోరారు. ‘ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. వాస్తవాలను ధ్రువీకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. మీకూ వీరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయా? COMMENT