News October 20, 2024

గుర్లలో మరణాలు.. పూర్తి స్థాయి విచారణకు సీఎం ఆదేశం

image

AP: విజయనగరం జిల్లా గుర్లలో సంభవించిన మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అతిసారం ప్రబలడంపై సమీక్షించిన ఆయన గుర్లలో వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. గ్రామంలో మరణాలు సంభవించడంపై ఐఏఎస్ విజయానంద్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Similar News

News February 2, 2026

జకోవిచ్.. ఆ టైటిల్ ఎప్పుడు నెగ్గుతాడో?

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన 10సార్లూ జకోవిచ్ విజయం సాధించారు. నిన్న జరిగిన ఫైనల్లోనూ గెలిచి, 25వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లు చల్లారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఈ సెర్బియా వీరుడు ఒక్క సింగిల్ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌నూ గెలవలేదు.

News February 2, 2026

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

image

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 2, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు

image

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.