News July 11, 2024

రాష్ట్ర ప్రగతి కోసం పార్లమెంటులో చర్చించండి: ఎంపీలకు పవన్ సూచన

image

AP: జనసేన MPలు, MLAలు ప్రతి నెలా ఓ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించాలని MPలకు సూచించారు. NDA, జనసేన పక్షాన మాట్లాడాలని, టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని తెలిపారు. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కాకుండా 10 మంది కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు.

Similar News

News January 5, 2026

రబీ వరిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయా?

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ఒక్కో ప్రాంతంలో ఒక్కో దశలో ఉంది. అయితే వరి ప్రారంభ దశ నుంచి జింకు లోపం, కాండం తొలుచు పురుగు పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జింకు లోపం వల్ల వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వచ్చి పైరు సరిగా పెరగదు. ఇక కాండం తొలుచు పురుగు మొక్క మొవ్వులోకి చొచ్చుకెళ్లి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వరిలో జింకు లోపం, కాండం తొలుచు పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 5, 2026

జాగ్రత్త..! మళ్లీ పెరిగిన చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్స్ వీస్తాయని IMD ఇప్పటికే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. చలి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

News January 5, 2026

వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.