News July 24, 2024
అసెంబ్లీలో నేడు రుణమాఫీపై చర్చ

TG: తాజాగా అమలైన రూ.2 లక్షల రుణమాఫీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28 తేదీల్లో పద్దుపై సభలో చర్చిస్తారు. 30న ప్రభుత్వం బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


