News December 13, 2025
DEC 14 పోలింగ్: 7 మండలాల్లో వైన్ షాపులు బంద్!

కామారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ DEC 14న జరగనుంది. ఈ విడతలో గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం సహా 7 మండలాల్లో (ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా) వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 12వ తేదీ సా. 5 గంటల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 14వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
జనగామ: 83.27 శాతం పోలింగ్ @1PM

జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 83.27 శాతం పోలింగ్ నమోదయింది. పాలకుర్తిలో 80.06 శాతం, దేవరుప్పులలో 87.64 శాతం, కొడకండ్లలో 83.39 శాతం నమోదయింది.
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<
News December 17, 2025
మంత్రి నేతృత్వంలో కమిటీ ఎందుకో.. ఆ నేతల్లో నిరాశ.!

కృష్ణా, NTR జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఖరారు కావడంతో, పదవులు దక్కని నేతల్లో నిరాశ నెలకొంది. MLAలు ప్రతిపాదించిన బుద్ధా వెంకన్న, కోనేరు నాని వంటి పేర్లకు కాకుండా, కొత్త వ్యక్తులకు పదవులు దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై పేర్లు పంపినా, వాటిని అధిష్ఠానం పరిగణించకపోవడంపై ‘అసలు కమిటీ ఎందుకు వేశారు?’ అనే చర్చ TDP శ్రేణుల్లో నడుస్తోంది.


