News December 11, 2024
డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం
Similar News
News November 17, 2025
మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్ఘాట్, ఆసిఫ్నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.
News November 17, 2025
ఈ మహిళలు ఏడాదికో కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చు!

రాజస్థాన్లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి మహిళలు జాతరలో తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సహజీవనం చేశాక గర్భం దాల్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చకపోతే మహిళ విడిపోయి మళ్లీ కొత్త వ్యక్తిని వెతుక్కునే స్వేచ్ఛ ఉంది. ఈ సహజీవనం కోసం అబ్బాయి అమ్మాయికి డబ్బు చెల్లించాలి. ఒకవేళ మహిళ మరొకరితో జీవించాలనుకుంటే ఎంచుకున్న కొత్త వ్యక్తి మాజీ భాగస్వామికి అధిక మొత్తంలో డబ్బు చెల్లించాలి.
News November 17, 2025
బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.


