News October 21, 2024
హైకోర్టులోనే తేల్చుకోండి: SC

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.
Similar News
News October 17, 2025
బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి!

స్వదేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్కు ఘోర పరాభవం జరిగినట్లు తెలుస్తోంది. అఫ్గనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ చేరుకున్న ప్లేయర్ల వాహనాలపై దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఖరి వన్డేలో 200 రన్స్ తేడాతో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘కొన్నిసార్లు ఓటమి తప్పదు’ అని ప్లేయర్లు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
News October 17, 2025
చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News October 17, 2025
లోకేశ్ ట్వీట్పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్ల ఫైర్!

ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్న మంత్రి లోకేశ్ <<18020050>>ట్వీట్పై<<>> కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్గా ఉందంటున్నారు. ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్కు సపోర్ట్ చేస్తున్నారు.