News August 7, 2024
జాతీయ విపత్తుగా ప్రకటించండి: రాహుల్ గాంధీ

కేరళలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాదం మిగిల్చిన బాధ, నొప్పిని తన కళ్లారా చూశారన్నారు. బాధితుల కోసం సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని బుధవారం లోక్ సభలో కేంద్రాన్ని కోరారు.
Similar News
News March 5, 2026
వాహనాలపై కొత్తగా రహదారి భద్రతా సెస్: మంత్రి

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు GOVT కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కొత్తగా 10% రహదారి భద్రతా సెస్ను విధించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్తో పాటు దీన్ని వసూలు చేస్తారు. ఏడాదికి ₹270CR వస్తుంది. రహదారి భద్రతా సదుపాయాలు, బ్లాక్స్పాట్ల మెరుగుదలకు దీన్ని వినియోగిస్తాం’ అని తెలిపారు. ఈమేరకు సవరణ బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టారు.
News March 5, 2026
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే!

కొందరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కానీ IT చట్టం ప్రకారం లిమిట్ దాటితే అధికారులు నోటీసులు పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లో రూ.10L కంటే క్యాష్ డిపాజిట్ చేసినా అధికారులు ఐటీ శాఖకు ఇన్ఫార్మ్ చేస్తారు.₹10L కంటే విలువైన విదేశీ వస్తువులు, ప్రయాణాలు చేసినా ఐటీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నా నోటీసులు రావొచ్చు.
News March 5, 2026
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్ కళ్యాణ్

AP: రాబోయే జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని Dy CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తెలిపారు. పంచాయతీల పునర్విభజనకూ న్యాయపరమైన అడ్డంకులు లేవని చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసి సంరక్షించేలా వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామని వివరించారు.


