News February 3, 2025
ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.
Similar News
News January 18, 2026
పాక్ సరిహద్దుల్లో AK-47 రైఫిళ్లు, పిస్టళ్లు లభ్యం

పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో 3 AK-47 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు, తుర్కియే, చైనా తయారీ పిస్టళ్లు, 98 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్ నుంచి ఈ ఆయుధాలను పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్థ ISI అండ ఉన్న ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.
News January 18, 2026
4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.
News January 18, 2026
ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


