News October 27, 2024

క్షీణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ ఆరోగ్యం!

image

ఇజ్రాయెల్ ప్ర‌తీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్‌ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖ‌మేనీ(85) ఆరోగ్య ప‌రిస్థితి కలవరపెడుతోంది. ఖ‌మేనీ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్ప‌టికే మాజీ అధ్య‌క్షుడు ఇజ్ర‌హీం రైసీ మృతితో దేశంలో అస్థిర‌త ఏర్ప‌డ‌డంతో తాజాగా ఖ‌మేనీ అనారోగ్యం ఇరాన్‌ను దిగులు పెడుతోంది. ఖ‌మేనీ వార‌సుడిగా రెండో పెద్ద‌కుమారుడు మొజ్తాబా ప‌గ్గాలు చేప‌డతారని తెలుస్తోంది.

Similar News

News October 27, 2024

రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!

image

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News October 27, 2024

ఏపీలో మంచి ఎకో సిస్టం ఉంది: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

News October 27, 2024

కరెంట్ షాక్‌తో ‘యమరాజు’ కన్నుమూత

image

‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్‌సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.