News September 11, 2024
తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం

AP: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. జంగారెడ్డి గూడెం నుంచి పెరవలి వెళ్తుండగా చిన్నాయిగూడెం వద్ద లారీ పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2026
వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్ ధరల హైక్ ఇప్పట్లో లేనట్లే!

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరల ఎఫెక్ట్ దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలపై ఉంటుందనే ఆందోళన మొదలైంది. అయితే ఇప్పట్లో ఇంధన ధరల పెరుగుదల ఉండదని సమాచారం. ఇప్పటివరకు ఇంధన సంస్థలు చమురు ధరలు పెరిగినప్పుడు భారం భరించి, తగ్గినప్పుడు రికవర్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా కేంద్రం ఇదే పాలసీని కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. చివరగా 2022 ఏప్రిల్లో ధరలు పెరిగాయి.
News March 3, 2026
చంద్రగ్రహణమైనా ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

చంద్రగ్రహణం వల్ల ఈరోజు దేశంలోని ఆలయాలు మూతపడినా కొన్ని మాత్రం తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి ఈ జాబితా ఉండగా, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా ఈరోజు తెరిచే ఉంటాయి. ఇక ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బిహార్), లక్ష్మీనాథ్ టెంపుల్ (RJ), కల్పేశ్వర్ (UKD) ఆలయాలు ఈరోజు తెరిచే ఉంటాయి.
News March 3, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 3)

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషేడ్జీ టాటా జననం
1937: రచయిత సత్యం శంకరమంచి జననం
1967: సింగర్ శంకర్ మహదేవన్ జననం
1969: సినీ నటి మధుబాలా జననం
2002: పార్లమెంటు తొలి దళిత స్పీకర్ బాలయోగి మరణం
2003: MRF వ్యవస్థాపకుడు కేఎం మామ్మెన్ మాపిళ్లై మరణం
2008: తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి నగరాజకుమారి మరణం.


