News August 19, 2024

తీవ్ర విషాదం.. రాఖీ కట్టి చనిపోయింది

image

TG: సోదరులకు రాఖీ కట్టి ఓ సోదరి తుదిశ్వాస విడిచిన విషాద ఘటన మహబూబాబాద్(D) నర్సింహులపేట(మ)లో జరిగింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమె(17)ను ప్రేమ పేరుతో ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో MHBDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.

Similar News

News January 28, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికల తొలిరోజు 32 నామినేషన్లు

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం మొదటిరోజు 32 నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తిలో 14, నాగర్ కర్నూల్‌లో 11, కొల్లాపూర్‌లో 7 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు గడువు ఉందని, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు.

News January 28, 2026

అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. దీంతో 3 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్ కానున్నాయి. రేపు 11amకు పవర్ అంత్యక్రియలు నిర్వహించనుండగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు అజిత్ మృతదేహం ఉన్న బారామతి ఆస్పత్రి వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.

News January 28, 2026

అమిత్ షాతో పవన్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.