News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.
Similar News
News March 26, 2025
మంత్రివర్గ విస్తరణకు వేళాయే

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.
News March 26, 2025
రాష్ట్రంలో నేరాలు 17% తగ్గాయి: డీజీపీ

AP: రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలెక్టర్ల సదస్సులో తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు. ‘2023 జూన్-2024 JAN మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్-2025 JAN వరకు 16,809 నేరాలు జరిగాయి. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం’ అని వివరించారు.
News March 26, 2025
PM కిసాన్ అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన అనర్హుల నుంచి ఇప్పటివరకు రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో వెల్లడించారు. ఈ స్కీమ్లో భాగంగా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు తెలిపారు. ఆధార్, ఐటీ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.