News November 23, 2024

దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య

image

AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

AIIMS భోపాల్ 128 పోస్టులు.. అప్లై చేశారా?

image

AIIMS భోపాల్‌లో 128 సీనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.. అర్హతగల వారు JAN15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.67,700 చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbhopal.edu.in/

News January 10, 2026

ఈ తప్పులతో మెదడుకు ముప్పు

image

మనం సాధారణం అని భావించే కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు ముప్పు కలుగుతుందంటున్నారు నిపుణులు. సరిపడా నిద్ర లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం, ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఈ అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు.

News January 10, 2026

మూవీ మేకర్స్.. ముందే ప్లానింగ్ ఉండదా?

image

సినిమా నచ్చితే ఫ్యాన్స్ రెండు, మూడు సార్లు చూస్తారు. అయితే కొంత నెగటివ్ టాక్ వచ్చినా మేకర్స్ స్ట్రాటజీలు మారుస్తున్నారు. సినిమా విడుదలైన 2-3 రోజులకు మరిన్ని సీన్లు యాడ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ విషయంలోనూ పలు కారణాలతో <<18818253>>మేకర్స్<<>> ఇదే చేస్తున్నారు. దీంతో రూ.కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలో ముందే ప్లాన్ చేసుకోరా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.