News November 23, 2024
దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య

AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
శనగపిండితో చర్మానికి ఎన్నో లాభాలు

శనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గించి చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చే క్లెన్సర్గానూ పనిచేస్తుంది. ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. దీనికి గంధం, పాలు, ముల్తానీ మట్టి, కాఫీ పొడి, నిమ్మరసం, పెరుగు, తేనె, పసుపు వంటివి కలిపి రాస్తే అదనపు ప్రయోజనాలుంటాయి.
News January 2, 2026
BRSకు కవిత డెత్ వార్నింగ్!

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో కవిత BRSకు డెత్ వార్నింగ్ ఇచ్చారు. KCR రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్నారు. KCR అసెంబ్లీలో మాట్లాడాలని పార్టీలు, ప్రజలు కోరుతున్న వేళ కూతురూ ఇదే మాట అని పుట్టింటి పార్టీని ఓ విధంగా ఇరకాటంలో పెట్టారు. గులాబీ బాస్పై కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడుతూనే KCR లేకపోతే పార్టీ కథ ముగిసినట్లే అని పరోక్షంగా హెచ్చరించారు. కవిత కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.
News January 2, 2026
IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


