News June 18, 2024

రెమ్యునరేషన్‌లో దీపికా పదుకొణె నంబర్-1

image

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఒక్కో సినిమాకు ₹15-30 కోట్లు తీసుకుంటున్నట్లు IMDB-ఫోర్బ్స్ డేటా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కంగనా(₹15-27cr), ప్రియాంకా చోప్రా(₹15-25cr), కత్రినా(₹15-25cr), అలియా(₹10-20cr), కరీనా(₹8-18cr), శ్రద్ధా కపూర్(₹7-15cr), విద్యాబాలన్(₹8-14cr), అనుష్క శర్మ(₹8-12cr), ఐశ్వర్యారాయ్(₹8-10cr) ఉన్నారని పేర్కొంది.

Similar News

News November 12, 2025

5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

image

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.

News November 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 64 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని పరశురాముడు ఎలా గుర్తించాడు?
జవాబు: ఓరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను రక్తం వచ్చేలా కుట్టింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. రక్తపు ధార తగిలి పరశురాముడు మేల్కొని, ఆ దారుణమైన బాధను సహించే శక్తి క్షత్రియుడికి తప్ప వేరొకరికి ఉండదని గుర్తించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 12, 2025

15-20 రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల్లో టెస్టులు: ఉత్తమ్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ కూలిపోవడానికి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లీకేజీలకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని NDSA పేర్కొందని చెప్పారు. 15-20 రోజుల్లో నీటి నిల్వలు తగ్గిన వెంటనే జియో ఫిజికల్, హైడ్రాలిక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు.