News October 17, 2024
సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR

TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
Similar News
News November 14, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 4

18. నిద్రలో కూడా కన్ను మూయనిది?(జ.చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?(జ.అస్త్రవిద్యచేత)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?(జ.యజ్ఞం చేయుట వలన)
21. జన్మించినా ప్రాణం లేనిది?(జ.గుడ్డు)
22. రూపం ఉన్నా హృదయం లేనిది?(జ.రాయి)
23. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(జ.శరణుకోరిన వారిని రక్షించకపోతే)<<-se>>#YakshaPrashnalu<<>>
News November 14, 2025
IND vs SA టెస్ట్.. తొలిరోజు స్కోర్ ఎంతంటే?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్టులో భారత్ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన SAను 159కే ఆలౌట్ చేసింది. మార్క్రమ్(31), ముల్డర్(24), టోనీ(24), రికెల్టన్(23) ఫర్వాలేదనిపించారు. బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరో 2, అక్షర్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్లో జైస్వాల్(12) అవుటవ్వగా.. KL రాహుల్(13*), సుందర్(6*) క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి IND ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.
News November 14, 2025
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం ప్రజలు జూబ్లీహిల్స్ లో తమకు ఓటు వేశారని చెప్పారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు హైదరాబాద్లో సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజలు మా తీరును గమనించి తీర్పును ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు.


