News July 15, 2024

అసత్య ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా: విజయసాయిరెడ్డి

image

AP: తనకు అక్రమ సంబంధం <<13632336>>అంటగట్టి<<>> అసత్య ప్రచారం చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లకూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతోపాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.

Similar News

News November 28, 2025

నేటి నుంచి వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడతాయని వివరించింది. నేడు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

News November 28, 2025

అమ్మానాన్నల మీద నిందలు వేస్తున్నారా..?

image

మాతృ నింద మహా వ్యాధిః పితృ నింద పిశాచతః
దైవ నింద దరిద్ర స్యాత్ గురు నింద కుల క్షయం
ఈ శ్లోకం ప్రకారం.. తల్లిని నిందించే వారికి వ్యాధులు కలుగుతాయి. తండ్రిని నిందిస్తే పిశాచత్వం ప్రాప్తిస్తుంది. దైవ నిందతో దరిద్రులవుతారు. అలాగే గురువును నిందించినట్లయితే వంశమే నాశనం అవుతుందట. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పే గురువులను, లోకాన్ని సృష్టించిన దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదని అంటారు.

News November 28, 2025

WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

image

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.