News July 5, 2024
UK ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162414156-normal-WIFI.webp)
వక్త, రచయిత ఉదయ్ నాగరాజు UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్ఫోర్డ్షైర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్గా, ఒకసారి మేయర్గా పనిచేశారు.
Similar News
News July 8, 2024
T20WC: ఒక్కో క్రికెటర్కు ₹5కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720409482439-normal-WIFI.webp)
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.
News July 8, 2024
PHOTOS: పూరీ తీరంలో రాష్ట్రపతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720410435602-normal-WIFI.webp)
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్నింగ్ వాక్ చేశారు. ‘తీరం వెంబడి నడుస్తున్నపుడు అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలిగించాయి. నిన్న జగన్నాథుడిని దర్శించినపుడు ఇలాంటి అనుభవమే కలిగింది’ అని Xలో పేర్కొన్నారు. ప్రకృతి వనరులు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయని, అలాంటి ప్రకృతిని ధ్వంసం కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
News July 8, 2024
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 4% తగ్గిన టైటాన్ షేర్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1715253240144-normal-WIFI.webp)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు క్షీణించి 79,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 24,291 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్ కార్ప్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. టైటాన్ షేర్ విలువ ఏకంగా 4% క్షీణించింది.