News June 5, 2024
ఓడిపోయా.. నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా: ముద్రగడ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని వివరించారు. కాగా పవన్ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 14, 2025
కోళ్లను పెంచేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

వారాంతపు సంతలో కోళ్లను కొని కొందరు పెంపకందారులు వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న కోళ్లలో కలుపుతారు. అయితే కొత్తగా తెచ్చిన కోళ్లకు వ్యాధులుంటే మొత్తం అన్ని కోళ్లకు సోకి మరణిస్తాయి. ఈ పద్ధతిని మానేయాలి. పెద్ద కోళ్లను, కోడి పిల్లలను కలిపి కాకుండా వాటి వయసుకు తగ్గట్లు ప్రత్యేకంగా పెంచాలి. కోళ్ల షెడ్ను శుభ్రం చేశాకే కొత్త కోళ్లను వదలాలి. కోళ్ల షెడ్డులోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.
News December 14, 2025
IMDలో 134 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

భారత వాతావరణ శాఖ(<
News December 14, 2025
సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే.. కంటి చూపు ఎలా మెరుగవుతుంది?

సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు, మనం నీటి ధార గుండా ఉదయించే లేత సూర్య కిరణాలను చూస్తాము. ఈ కిరణాలు నీటి పొరల ద్వారా వడపోతకు గురై, వాటి తీవ్రత తగ్గుతుంది. ఈ విధంగా తగ్గిన తీవ్రత ఉన్న కాంతిని చూడటం వలన కళ్లకు ఎలాంటి హాని జరగకుండా, వాటికి ఒక సహజమైన శక్తి లభిస్తుంది. క్రమం తప్పకుండా ఇలా ఉదయం సూర్యకాంతిని(నీటి ధార గుండా) చూడటం వల్ల కళ్ల కండరాలు బలోపేతమై, కాలక్రమేణా కంటి చూపు మెరుగుపడుతుంది.


