News October 27, 2024
సైనికులతో దీపావళి చేసుకోనున్న రక్షణ మంత్రి

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది దీపావళిని జవాన్లతో కలిసి చేసుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లాలో బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికులతో కలిసి ఆయన వేడుక జరుపుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు భారత వాయుసేనకు చెందిన ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కార్ ర్యాలీ తవాంగ్కు చేరుకోనుంది. ఆ ర్యాలీకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ స్వాగతం పలకనున్నారు.
Similar News
News December 3, 2025
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
News December 3, 2025
NCSSRలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (<


