News July 9, 2024
50 మండలాల్లో వర్షాభావం
AP: వర్షాభావం కారణంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ నెమ్మదించింది. ఏపీలో వానలు అంతంతమాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. 11 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. 50వరకు మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఖాళీగా ఉండటంతో సాగుకు ఇబ్బందవుతోందంటున్నారు. గోదావరి డెల్టాలో సాగు ఓ మాదిరిగా ఉండగా, కృష్ణా డెల్టాలో అసలు నారుమళ్లే పోయలేదని చెబుతున్నారు.
Similar News
News October 15, 2024
కలికితురాయి అంటే?
కీర్తికిరీటంలో మరో కలికితురాయి అంటూ వార్తల్లో వింటుంటాం. అయితే, చాలా మందికి దీని అర్థం తెలియదు. ‘కలికితురాయి’ అంటే
కొంగ తల ఈకలతో చేసిన శిరోభూషణము అని అర్థం. వివరంగా చెప్పాలంటే.. కలికి అంటే మనోహరమైన, తురాయి అంటే పక్షి ఈక లేదా పువ్వుతో తయారుచేసిన మకుటాలంకారం. ఎవరైనా ఏదైనా అవార్డును, ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తి “కీర్తి కిరీటంపై కలికితురాయి ” అనే నానుడిని వాడతారు.
News October 15, 2024
గురుకులాలను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర?: KTR
TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
News October 15, 2024
పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్
ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. న్యూయార్క్లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.