News October 22, 2024
ఆ మూవీలకు కచ్చితంగా నో చెప్తా: జాతీయ ఉత్తమ నటి
భారీ బడ్జెట్తో తెరకెక్కే మసాలా మూవీలకు కచ్చితంగా నో చెప్తానని జాతీయ ఉత్తమ నటి నిత్యా మేనన్ అన్నారు. అదే చిన్న సినిమా అయినా మంచి పాత్ర అయితేనే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సంతోషాన్ని ఇచ్చే పాత్రలు చేయడం ఇష్టమని తెలిపారు. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘తిరుచిత్రంబలం’ చిత్రానికి నిత్య ఉత్తమ నటి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2024
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, రేపటికి తుఫాన్గా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ గురువారం తీవ్ర తుఫాన్గా బలపడుతుంది, ఆ తర్వాత ఒడిశాలోని పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
News October 22, 2024
షా, ఫడ్నవీస్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో సంచలనం!
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముంబైలో అమిత్ షా సమక్షంలో DY CM దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన UBT నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కలిశారన్న వార్తలు సంచలనంగా మారాయి. వీరు మహాయుతిలో చేరతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ భేటీ వార్తలను రౌత్ కొట్టిపారేసినా ఎక్కువ సీట్లను రాబట్టేలా MVAను బెదిరించేందుకు SS UBT ఇలాంటి ఫీలర్లు వదులుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.
News October 22, 2024
హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు హర్షసాయి తనను లైంగికంగా వేధించారని నటి మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది.