News March 19, 2024
కలుషిత రాజధానుల్లో అగ్రస్థానానికి మళ్లీ ఢిల్లీ!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710810992809-normal-WIFI.webp)
ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానుల జాబితాలో ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. స్విస్ సంస్థ IQAIR విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత సూచీలో పాకిస్థాన్లోని లాహోర్ గత ఏడాది టాప్లో ఉండగా, ఇప్పుడు ఢిల్లీ ఆ స్థానానికి చేరింది. అత్యంత కలుషిత దేశాల్లో భారత్ గత ఏడాది 8వ స్థానంలో ఉండగా, ఈసారి 3వ ప్లేస్లో నిలిచింది. అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతం జాబితాలో బిహార్లోని బెగుసరాయ్ అగ్రస్థానంలో ఉంది.
Similar News
News July 5, 2024
టీచర్ ట్రాన్స్ఫర్.. స్కూల్ మారిన 133 మంది స్టూడెంట్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720184222244-normal-WIFI.webp)
TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.
News July 5, 2024
ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర బొనాంజా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720183593471-normal-WIFI.webp)
ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర సర్కార్ రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.
News July 5, 2024
MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720182499948-normal-WIFI.webp)
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.