News January 27, 2025
రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ.. కోహ్లీకి చోటు

రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో ఆడే మ్యాచ్కు ఢిల్లీ జట్టును ప్రకటించింది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపిక కాగా, పంత్కు చోటు దక్కలేదు. 13ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు. JAN 30నుంచి మ్యాచ్ జరగనుంది.
జట్టు: బదోని, కోహ్లీ, ప్రణవ్, సాంగ్వాన్, అర్పిత్, మయాంక్, శివమ్, సుమిత్, వాన్ష్, మనీ, హర్ష్ త్యాగి, సిద్ధాంత్, సైనీ, యశ్ ధుల్, గగన్, జాంటీ సిద్ధు, హిమ్మత్, వైభవ్, ఆర్. గెహ్లోత్, జితేశ్ సింగ్.
Similar News
News September 14, 2025
ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT