News January 14, 2025
చిన్నారులతో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూసిన ఢిల్లీ బీజేపీ చీఫ్

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర చిన్నారులతో కలిసి వీక్షించారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని తన పుట్టిన రోజు సందర్భంగా గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్ చిన్నారులతో చూశారు. ఈ విషయాన్ని ఆయన Xలో తెలియజేశారు. ఈ నెల 10న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Similar News
News November 26, 2025
HYD: ఈషా సింగ్ను అభినందించిన ఏడీజీ

ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News November 26, 2025
HYD: ఈషా సింగ్ను అభినందించిన ఏడీజీ

ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


