News September 22, 2024

స్మృతి ఇరానీకి ఢిల్లీ BJP పగ్గాలు?

image

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP వ్యూహాలకు పదునుపెడుతోంది. AAP కన్వీనర్ కేజ్రీవాల్ CM పదవి నుంచి తప్పుకొని ఆతిశీకి బాధ్యతలు అప్పగించగా BJP తమ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని తెరపైకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సభ్యత్వ నమోదును ఆమె చూసుకుంటున్నారు. ఆమెనే CM అభ్యర్థనే ప్రచారం కూడా ఉంది. సౌత్ ఢిల్లీలో ఇల్లు కొనడం చూస్తే స్మృతి ఢిల్లీలో పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

Similar News

News October 18, 2025

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉంటే పిల్లలు పుట్టరా?

image

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను చికిత్సకు ముందే తీసి ఫ్రీజ్‌&ప్రిజర్వ్‌ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.

News October 18, 2025

పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

image

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్‌తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్‌కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.

News October 18, 2025

విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

image

AP: VSP పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్‌ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్‌ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.