News December 3, 2024
Delhi Elections: ఆప్తో జట్టుకట్టిన I-PAC

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఆప్, పొలిటికల్ కన్సల్టెన్సీ I-PAC మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో ఆప్తో కలిసి ఐప్యాక్ పనిచేసింది. అప్పుడు 70 స్థానాల్లో 62 చోట్ల ఘన విజయాన్ని అందుకుంది. ఢిల్లీని ఆప్ పదేళ్లుగా పాలిస్తోంది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి. వీటిని అధిగమించి కేజ్రీవాల్ సెంట్రిక్గా ఐప్యాక్ ప్రచారం ఉంటుందని తెలుస్తోంది.
Similar News
News January 19, 2026
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.
News January 19, 2026
నాన్న ఎదుట ఏడ్చేవాడిని: హర్షిత్ రాణా

తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి భారత క్రికెటర్ హర్షిత్ రాణా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పదేళ్లపాటు నేను ఎంపిక కాలేదు. ట్రయల్స్కు వెళ్లడం, నా పేరు ఉండకపోవడం జరిగేది. ఇంటికొచ్చి నాన్న ఎదుట ఏడ్చే వాడిని. ఇప్పుడు ఆ వైఫల్యాలు పోయాయని భావిస్తున్నా. ఏం జరిగినా ఎదుర్కోగలను’ అని చెప్పారు. ఇప్పటిదాకా 14 వన్డేలు ఆడిన హర్షిత్ 26 వికెట్లు పడగొట్టారు. NZతో మూడో వన్డేలో 3 వికెట్లు తీశారు.
News January 19, 2026
విద్యార్థిగా సీఎం రేవంత్

TG: యూఎస్ హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారనున్నారు. కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ‘లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ’ ప్రోగ్రామ్కు ఆయన ఈ నెల 25-30 వరకు హాజరవుతారని CMO తెలిపింది. మొత్తం 20దేశాల నుంచి నేతలు ఈ క్లాసులకు హాజరుకానున్నారు. పలు అంశాలపై ఆయన అసైన్మెంట్స్తోపాటు హోంవర్క్ కూడా చేయనున్నారు. భారత్ నుంచి సీఎం హోదాలో హాజరవుతున్న తొలి వ్యక్తి రేవంతే.


