News February 7, 2025

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

image

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.

Similar News

News January 19, 2026

వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

image

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.

News January 19, 2026

WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News January 19, 2026

పెట్టుబడుల వేటలో సీఎంలు!

image

దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల టార్గెట్ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మంత్రులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. CBN ఒకరోజు ముందే వెళ్లి పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ రేవంత్ కూడా తన బృందంతో వెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. లేటెస్ట్ పర్యటనలతో ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే చర్చ మొదలైంది.