News April 13, 2025
ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం భర్త నడుపుతున్నారు: ఆతిశీ

ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖా గుప్తా భర్త అనధికారికంగా నడుపుతున్నారని ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆరోపించారు. గతంలో మహిళా సర్పంచ్ వ్యవహారాలను ఆమె భర్తలు చూసుకునే వాళ్లని విన్నాం, ఇప్పుడు ఏకంగా సీఎం పనులనే రేఖా గుప్తా భర్త చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఒక మహిళా నాయకురాలై ఉండి మరో మహిళా నేతను అవమానపరచడం ఆశ్చర్యకరంగా ఉందని ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా విమర్శించారు.
Similar News
News October 20, 2025
‘డ్యూడ్’, ‘K-Ramp’ కలెక్షన్లు ఎంతంటే?

* ప్రదీప్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ 3 రోజుల్లో రూ.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, నిన్న రూ.21 కోట్లు రాబట్టింది.
* కిరణ్ అబ్బవరం, యుక్తి జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ 2 రోజుల్లో రూ.5.1 కోట్లు(నెట్) కలెక్ట్ చేసినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది.
News October 20, 2025
బాబర్ పని అయిపోయిందా?

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 16 పరుగులకే ఔటయ్యారు. బాబర్ గత 75 ఇన్నింగ్సుల్లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా చేయలేదు. సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. గత 15 టెస్టు ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16గా ఉన్నాయి. సగటు 18.40 కాగా హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయారు.
News October 20, 2025
ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.