News December 31, 2024
2015 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ‘స్వచ్ఛ’ డిసెంబర్!

2015 తర్వాత వచ్చిన డిసెంబర్లలో ఢిల్లీలో అత్యంత తక్కువ కాలుష్యం ఈ ఏడాది డిసెంబరులోనే నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ నెల ప్రథమార్ధంలో బలమైన గాలులు, ద్వితీయార్థంలో రికార్డు స్థాయి వర్షాలు దీని వెనుక కారణాలని వివరించారు. ఇప్పటికీ ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే.. అంటే 295 పాయింట్ల వద్ద ఉంది. గుడ్డికంటే మెల్ల మిన్న అన్నట్లుగా ఈ 9ఏళ్లలో ఇది కొంచెం బెటర్ అయిందనేది అధికారుల ప్రకటనలో సారాంశం.
Similar News
News November 4, 2025
రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 4, 2025
కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.
News November 4, 2025
మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.


