News October 20, 2024
ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం

రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 5, 2025
భారీగా సంబరాలు.. బాలయ్య ఫ్యాన్స్కు నిరాశ

అనంతపురంలో బాలకృష్ణ ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. ‘అఖండ-2’ విడుదలవుతుందని సంబరాలు భారీగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు 110 కేజీల కేక్ కట్ చేశారు. ‘జై బాలయ్య’ నినాదాలతో నగరం దద్దరిల్లింది. అయితే అనూహ్యంగా సినిమా వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ మూవీని డిసెంబర్లోనే రిలీజ్ చేస్తారా? సంక్రాంతికి ప్లాన్ చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
News December 5, 2025
ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి?

2 పెద్ద ప్రమిదలు, ఒక చిన్న ప్రమిద తీసుకొని వాటికి పసుపు, కుంకుమ పెట్టాలి. బియ్యప్పిండి ముగ్గుపై పెద్ద ప్రమిదలను ఒకదానిపై మరొకటి పెట్టి అందులో రాళ్ల ఉప్పు పోసి పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై చిన్న ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో రెండు వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆ సమయంలో దీపం శ్లోకం చదువుకోవాలి. నైవేద్యం పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం చదివినా శుభ ఫలితాలుంటాయి.
News December 5, 2025
సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్కు మరో అవకాశం

AP: సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2027 DEC 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రైతులు తమ మండల పరిధిలోని మీ సేవ, గ్రామ/వార్డు సచివాలయంలో అప్లికేషన్లు సమర్పించాలని సూచించింది. దరఖాస్తులను 90 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. 2024 జూన్ 15 నాటికి లావాదేవీలు జరిగిన భూములపై రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


