News November 20, 2024
సైబర్ బాధితుడికి పరిహారం ఇవ్వాలని SBIని ఆదేశించిన ఢిల్లీ HC

సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.
Similar News
News November 17, 2025
చలి తీవ్రత.. 10 జిల్లాలకు అలర్ట్!

TG: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్(D) సిర్పూర్లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ADB, వికారాబాద్, MDK, నిర్మల్, BPL, మంచిర్యాల, WGL, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.
News November 17, 2025
బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు: మంచు లక్ష్మి

తనకు 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేనెప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. హాల్ టికెట్ల కోసం ఓసారి స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో షాకయ్యాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటారు కానీ బయటకు చెప్పుకోలేరు’ అని తెలిపారు.
News November 17, 2025
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.


