News March 4, 2025
మనుస్మృతి, బాబర్నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.
Similar News
News March 4, 2025
బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

బనకచర్ల ప్రాజెక్టుకు TG ప్రభుత్వం అడ్డు <<15640378>>చెప్పడంపై<<>> AP CM చంద్రబాబు స్పందించారు. ‘గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోంది. నాకు 2 ప్రాంతాలు సమానం.. రెండు కళ్లు అని చెప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు.
News March 4, 2025
ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: సుప్రీం

సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, TN, HP, రాజస్థాన్లకు నోటీసులు జారీచేసింది.
News March 4, 2025
కోహ్లీ హాఫ్ సెంచరీ, అయ్యర్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రోహిత్, గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అయ్యర్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, అయ్యర్ 45 పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో 136/3గా ఉంది. భారత్ విజయానికి మరో 23 ఓవర్లలో 129 పరుగులు కావాలి. కోహ్లీ (51*), అక్షర్ పటేల్ (2*) క్రీజులో ఉన్నారు.