News April 7, 2025
డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: టీపీసీసీ చీఫ్

TG: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరు ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్తో లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోదండరాంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.
Similar News
News April 7, 2025
కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.
News April 7, 2025
ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.
News April 7, 2025
సంక్షోభంలో ’ఆక్వా’.. నిద్రపోతున్న సర్కార్: జగన్

AP: రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతే ప్రభుత్వం నిద్రపోతోందా అని మాజీ CM జగన్ ప్రశ్నించారు. టారిఫ్ల పేరు చెప్పి సర్కార్ మిన్నకుండిపోయిందని ఎక్స్లో విమర్శించారు. ‘100 కౌంట్ రొయ్యల ధర రూ.280 నుంచి రూ.200కు పడిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధరల పతనాన్ని అడ్డుకోవాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు’ అని ఆయన మండిపడ్డారు.