News March 8, 2025
డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గవు: కిషన్ రెడ్డి

TG: డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు తగ్గదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదన్నారు. సీఎం రేవంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 జాతీయ రహదారులను పూర్తయ్యాయని, పార్లమెంట్ సమావేశాల అనంతరం మరో 10 రహదారులను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
Similar News
News December 3, 2025
చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు అవుతున్నాయా?

ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని టాడ్లర్స్ డయేరియా అంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థాలు, తీపి తగ్గించడంతో పాటు జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అయినా తగ్గకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావొచ్చు. దీనికి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
News December 3, 2025
గాన గంధర్వుడి విగ్రహంపై వివాదం.. మీరేమంటారు?

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును పలువురు <<18452414>>అడ్డుకోవడంపై<<>> నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్పీ బాలు ప్రాంతాలకు అతీతం అని, అలాంటి గొప్పవారి విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 3, 2025
49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్స్టిట్యూట్లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://socialjustice.gov.in


