News March 18, 2025
మంచు లక్ష్మి, కాజల్, రానాపై కేసుకు డిమాండ్!

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్రాజ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 26, 2025
సూర్యాపేట: ‘ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలను పాటించాలి’

ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి అధికారులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయాలని, రాజ్యాంగ హక్కులను కాపాడాలన్నారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News November 26, 2025
RRR కేసు.. సునీల్ కుమార్కు సిట్ నోటీసులు

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.


