News November 10, 2024
స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్

TG: 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన తమను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి రాగానే 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 31, 2025
రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.
News October 31, 2025
వాడని సిమ్స్ను డియాక్టివేట్ చేయండిలా!

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్కు రిక్వెస్ట్ చేయొచ్చు.
News October 31, 2025
CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.


