News April 19, 2024
ఏప్రిల్ 23న సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న సెలవు ప్రకటించాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని గుర్తు చేశారు. ఆరోజు గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ చేస్తామని, ఈ నేపథ్యంలో అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.
Similar News
News October 19, 2025
నటి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

బిహార్ ఎన్నికల వేళ భోజ్పురి నటి సీమా సింగ్కు ఊహించని పరిణామం ఎదురైంది. NDA కూటమి అభ్యర్థి(LJP)గా ఆమె దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్లో లోపాలున్నాయని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో చాప్రా(D) మఢేరా అసెంబ్లీ స్థానంలో RJD, JSP మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే నామినేషన్లోని చిన్నలోపంపై SECకి వివరించామని, సమస్య పరిష్కారమవుతుందని LJP చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.
News October 19, 2025
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్ 50 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://munitionsindia.in/career/
News October 19, 2025
వరి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.