News September 14, 2024

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్

image

APలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, MPTCలకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు వరదలతో ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 9, 2026

అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.

News March 9, 2026

నెయ్యికి కొరత లేదు: టీటీడీ

image

తిరుమల లడ్డూల తయారీలో వాడే నెయ్యికి కొరత లేదని TTD తెలిపింది. మూడంచెల కొనుగోలు విధానం ద్వారా ఆవు నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 7 లక్షలకు పైగా లడ్డూలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో క్లారిటీ ఇచ్చింది.

News March 9, 2026

చిన్న సినిమా.. పెద్ద హిట్!

image

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తమిళంలో <<18664403>>తెరకెక్కిన<<>> ‘తాయ్ కిళవి’ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 70 ఏళ్ల వడ్డీ వ్యాపారి పాత్రలో రాధిక చేసిన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. హీరో కార్తికేయన్ ఈ మూవీని నిర్మించగా, శివకుమార్ మురుగేశన్ తెరకెక్కించారు.