News October 11, 2024
రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

దివంగత రతన్ టాటా దేశానికి చేసిన సేవకు గుర్తుగా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. గొప్ప మానవతావాది అయిన టాటా నిజమైన రత్నమని, ఆయనను అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవడం సముచితమని పేర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర క్యాబినెట్ కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసింది. కాగా నిన్న కోట్లాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
* టాటాకు ‘భారతరత్న’ డిమాండ్పై మీరేమంటారు?
Similar News
News November 15, 2025
PGIMERలో 151 పోస్టులు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<
News November 15, 2025
హనుమాన్ చాలీసా భావం – 10

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 15, 2025
ఈ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్లరు.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోని ఓ ఊరు ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా(TG) మల్దకల్ ప్రజలు తిరుమలకు వెళ్లరు. దీనికి కారణం ఆ ఊరిలోనే వెలసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయం. తమ స్థానిక దైవమైన తిమ్మప్పనే తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. ఇక్కడ ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రజలు తమ ఇళ్లను ఆలయ గోపురం కంటే ఎత్తుగా నిర్మించరు.


