News November 27, 2024
బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలని డిమాండ్లు.. మీరేమంటారు?

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలనే డిమాండ్ పెరుగుతోంది. నిన్న జగన్, మల్లికార్జున ఖర్గే ఈవీఎంలు వద్దని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేయాలని ఖర్గే కోరారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. EVMలతో పేద, బడుగు బలహీన వర్గాల ఓట్లు వృథా అవుతున్నాయని, వాళ్లంతా బ్యాలెట్ పేపర్ పద్ధతే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 13, 2025
కామారెడ్డి: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ

కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యవసాయ రంగంలో సమూహ బలం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
News November 13, 2025
మూడేళ్లు జైల్లో గడిపిన అల్-ఫలాహ్ ఫౌండర్!

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.


