News April 5, 2024
డీమార్ట్ మార్కెట్ వ్యాల్యూ రూ.3లక్షల కోట్లు!
డీమార్ట్ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ మార్కెట్ విలువ తిరిగి రూ.3లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్ఈ ఇంట్రాడేలో కంపెనీ షేరు వాల్యూ 6 శాతం పెరిగి రూ.4710.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్న ట్రేడింగ్ ముగిసే నాటికి కంపెనీ విలువ రూ.3,02,405 కోట్లకు చేరుకుంది. 2021 అక్టోబర్లో ఈ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.3లక్షల కోట్లకు చేరింది.
Similar News
News October 8, 2024
FLASH: లీడింగ్లో వినేశ్ ఫొగట్
భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ లీడింగ్లో ఉన్నారు. హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆమె రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లాలో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ 54 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
News October 8, 2024
అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్
రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.