News March 22, 2024
ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది: చద్దా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ‘ఎమర్జెన్సీని ప్రకటించనప్పటికీ.. ఇండియాలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంలను లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం చూడలేదు. బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 20, 2025
BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 20, 2025
టూత్ పేస్ట్లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

కొన్ని ప్రముఖ టూత్పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.