News July 11, 2024
YCP ఆఫీసు కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు

AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న YCP ఆఫీసు కూల్చివేత ఘటనపై ఆ పార్టీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని న్యాయస్థానం సూచించినా ఆఫీసును కూల్చివేయడం కోర్టు ధిక్కరణే అని YCP తరఫు లాయర్ పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
45 డిగ్రీలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప హీట్ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న APలోని 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 17, 2026
సర్వత్రా ఉత్కంఠ.. సా.4 గంటలకు డీలిమిటేషన్పై ఓటింగ్

లోక్సభలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుపై సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యాయి. అటు బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన 360 ఓట్లు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై LSలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు చర్చ జరిగింది.
News April 17, 2026
దక్షిణాది ఇస్తుంది.. ఉత్తరాది ఖర్చు చేస్తుంది: అసదుద్దీన్

డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారితే లోక్సభలో ప్రతిపక్షాల గొంతు మూగబోతుందని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. సౌత్ స్టేట్స్పై నార్త్ పెత్తనం చేస్తుంది. దక్షిణాది ఇస్తే ఉత్తరాది ఖర్చు చేస్తుంది. దేశ GDPలో 30%, పన్ను రాబడిలో 21 % సౌత్ నుంచే వస్తోంది. సుపరిపాలన చేసినందుకు ఈ శిక్ష’ అని మండిపడ్డారు.


