News June 12, 2024
శాఖల వారీగా శ్వేతపత్రాలు: చంద్రబాబు

AP: జగన్ నాశనం చేసిన వ్యవస్థలను మనం బాగుచేయాలని మంత్రులతో భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర పునర్మిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం’ అని సూచించారు.
Similar News
News November 25, 2025
అయోధ్యలో నేడు కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ

అయోధ్య రామాలయంలో PM మోదీ నేడు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్ను ఆవిష్కరిస్తారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు, ఓం సింబల్ ఉంటాయి. రామ మందిరానికి 2020 AUG 5న భూమిపూజ, 2024 JAN 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాగా నేడు ధ్వజారోహణ ఉత్సవం నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News November 25, 2025
హనుమాన్ చాలీసా భావం – 20

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే.. ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేం కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 25, 2025
తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.


