News March 31, 2024

అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో నగదు జమ చేసింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 27, 2026

ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

image

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.

News March 27, 2026

కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

image

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.

News March 27, 2026

GK: చంద్రయాన్-3 విశేషాలు

image

⋆ ప్రయోగం తేదీ: జులై 14, 2023
⋆ చంద్రుడిపై ల్యాండింగ్: AUG 23, 2023
⋆ రాకెట్ పేరు: LVM3-M4, ల్యాండర్: విక్రమ్, రోవర్: ప్రజ్ఞాన్
⋆ చంద్రయాన్-3 ల్యాండయిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
⋆ ల్యాండింగ్ తేదీని కేంద్రం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది
⋆ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్
⋆ US, రష్యా, చైనా తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ చేసిన 4th దేశంగా భారత్