News October 17, 2024
జంక్ ఫుడ్తో డిప్రెషన్
జంక్ ఫుడ్తో ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అలాంటి ఆహారం వల్ల డిప్రెషన్ కూడా పెరుగుతుందని తాజాగా మానసిక వైద్యుడు డేనియల్ అమెన్(US) వెల్లడించారు. ఇప్పటికే ఒత్తిడితో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్ను వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. శరీరంలోని మైక్రోబయోమ్ మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.
Similar News
News October 17, 2024
46 పరుగులకే భారత్ ఆలౌట్
NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.
News October 17, 2024
సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్
యాక్టర్ సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.
News October 17, 2024
జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి: జగన్
AP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందని, కష్టపడిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారుచేయాలన్నారు.