News September 25, 2024

సూట్‌లో డిప్యూటీ సీఎం భట్టి

image

TG: విదేశీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్ వెగాస్‌లో జరిగిన MINE EXPO 2024లో పాల్గొన్నారు. దీనికి 125 దేశాల నుంచి మొత్తం 44,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని, పలు కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే భట్టి సూట్‌లో కొత్తగా కనిపించారు.

Similar News

News October 24, 2025

ఐరన్ మ్యాన్ పోటీల్లో రికార్డు సృష్టించిన రీనీ నోరోన్హా

image

ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన ఐరన్‌మ్యాన్‌ ట్రయథ్లాన్‌‌ను పూర్తి చేసి మన దేశంలో పిన్నవయస్కురాలైన మహిళా ఐరన్‌మ్యాన్‌గా చరిత్రకెక్కారు రీనీ నోరోన్హా. 19 ఏళ్ళ రీనీ 3.8 కి.మీ స్విమ్మింగ్‌, 180 కి.మీ బైక్‌ రైడ్‌, 42.2 కి.మీ రన్‌‌ ఈవెంట్లను పద్నాలుగు గంటల్లోనే పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం చెన్నై ఐఐటిలో డేటా సైన్స్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ చేస్తున్నారు.

News October 24, 2025

ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

image

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్‌తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.

News October 24, 2025

మృత్యు శకటాలుగా ప్రైవేట్ బస్సులు!

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారాయి. 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇవాళ మరో ప్రమాదంలో 20కి పైగా మరణించారు. అతివేగం, నిర్లక్ష్యం, సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల పాటు అధికారులు హడావిడి చేసినా ఆ తర్వాత తనిఖీలు చేయడం లేదు.