News September 25, 2024

సూట్‌లో డిప్యూటీ సీఎం భట్టి

image

TG: విదేశీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్ వెగాస్‌లో జరిగిన MINE EXPO 2024లో పాల్గొన్నారు. దీనికి 125 దేశాల నుంచి మొత్తం 44,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని, పలు కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే భట్టి సూట్‌లో కొత్తగా కనిపించారు.

Similar News

News December 6, 2025

తూ.గో.: 76 శాతం ‘ఖరీఫ్‌’ కోతలు పూర్తి

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 76.42 శాతం కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎస్. మాధవరావు తెలిపారు. మొత్తం 81,406 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 62,217 హెక్టార్లలో పంట కోతలు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

image

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.

News December 6, 2025

రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

image

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.